అమరావతి రాజధాని నగరంలో జాతీయస్థాయి విశ్వవిద్యాలయాలు
- December 09, 2016
అమరావతి రాజధాని నగరంలో జాతీయస్థాయి ప్రముఖ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సీఆర్డీఏ కసరత్తు చేస్తోంది. ప్రపంచ స్థాయిలో మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలతో యూనివర్సిటీల ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానం పలికింది. సీఆర్డీఏ అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు డౌనలోడింగ్ చేసుకొని కొత్త సంవత్సరంలో జనవరి నాల్గో తేదీ లోపు సీల్డ్ కవర్లో తమ స్పందనను తెలియజేయాలని కోరింది.
ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకొన్న విద్యా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి అమరావతిలో క్యాంపస్లు ప్రారంభించేందుకు ఒప్పించింది. ఎకరం రూ.50 లక్షలకు భూములు కేటాయిస్తోది. యూనివర్సిటీల ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపు, అనుమ తులన్నింటిని ఇప్పించేందుకు సీఆర్డీఏలో ఒక ప్రత్యేక బృందాన్ని నియమించింది. జాతీయస్థాయిలో బిట్స్ పిలాని, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఇండియన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స బెంగళూరు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తేజ్పూర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఇండియన ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స అండ్ టెక్నాలజీ గుర్తింపు పొందాయి.వీటిని కూడా అమరావతికి తీసుకురావడమే లక్ష్యంగా సీఆర్డీఏ ఆహ్వానాలు పలుకుతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







