అమరావతి రాజధాని నగరంలో జాతీయస్థాయి విశ్వవిద్యాలయాలు
- December 09, 2016
అమరావతి రాజధాని నగరంలో జాతీయస్థాయి ప్రముఖ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సీఆర్డీఏ కసరత్తు చేస్తోంది. ప్రపంచ స్థాయిలో మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలతో యూనివర్సిటీల ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానం పలికింది. సీఆర్డీఏ అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు డౌనలోడింగ్ చేసుకొని కొత్త సంవత్సరంలో జనవరి నాల్గో తేదీ లోపు సీల్డ్ కవర్లో తమ స్పందనను తెలియజేయాలని కోరింది.
ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకొన్న విద్యా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి అమరావతిలో క్యాంపస్లు ప్రారంభించేందుకు ఒప్పించింది. ఎకరం రూ.50 లక్షలకు భూములు కేటాయిస్తోది. యూనివర్సిటీల ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపు, అనుమ తులన్నింటిని ఇప్పించేందుకు సీఆర్డీఏలో ఒక ప్రత్యేక బృందాన్ని నియమించింది. జాతీయస్థాయిలో బిట్స్ పిలాని, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఇండియన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స బెంగళూరు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తేజ్పూర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఇండియన ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స అండ్ టెక్నాలజీ గుర్తింపు పొందాయి.వీటిని కూడా అమరావతికి తీసుకురావడమే లక్ష్యంగా సీఆర్డీఏ ఆహ్వానాలు పలుకుతోంది.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!









