ప్రస్తుతానికి పర్లేదు...భవిష్యత్తులో ప్రమాదం
- December 11, 2016
ప్రపంచ పైకప్పుగా పేరొందిన టిబెట్లో సగటు ఉష్ణోగ్రత, వర్షపాతం స్థిరంగా పెరిగినట్లు ఓ పరిశోధనా కేంద్రం విడుదల చేసిన నివేదికలో తేలింది. చైనాకు చెందిన టిబెట్ స్వయంప్రతిపత్త వాతావరణ కేంద్రం, ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ల పరిశోధక కేంద్రంలు సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి. గ్లోబల్వార్మింగ్ కారణంగా టిబెట్ వాతావరణంలో ఓ వైపు వేడి, మరోవైపు వర్షపాతమూ పెరిగినట్లుగా ఆ నివేదిక పేర్కొంది. ఈ మార్పులను రెండు వైపులా పదునున్న కత్తిగా నిపుణులు పోల్చారు. ఈ పరిస్థితి టిబెట్లో వ్యవసాయానుకూల వాతావరణానికి నాంది పలుకుతుంది.అయితే సమయం గడుస్తున్న కొద్దీ ఇది మరింత ప్రమాదానికి దారి తీయనుందని వారు అభిప్రాయపడ్డారు. గడిచిన మూడున్నర దశాబ్దాలుగా మే నుంచి సెప్టెంబరు మధ్య(వరద సీజన్)లో స్థిరంగా ఉష్నోగ్రతలు పెరుగుతున్నాయి. 1981 నుంచి 2016 మధ్య సగటు ఉష్ణోగ్రతలో దశాబ్దానికి 0.3 డిగ్రీల సెంటిగ్రేడ్ చొప్పున పెరుగుదల నమోదైనట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది వరద సీజన్లో సగటు ఉష్ణోగ్రత 11.9 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.
సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇది 0.44 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. మరోవైపు ఈ ఏడాది సగటు వర్షపాతం 445.1ఎంఎంగా నమోదైంది. మిగిలిన ఏళ్లతో పోల్చుకుంటే ఇది 62. 4 ఎంఎం ఎక్కువ అని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







