ప్రస్తుతానికి పర్లేదు...భవిష్యత్తులో ప్రమాదం

- December 11, 2016 , by Maagulf
ప్రస్తుతానికి పర్లేదు...భవిష్యత్తులో ప్రమాదం

ప్రపంచ పైకప్పుగా పేరొందిన టిబెట్‌లో సగటు ఉష్ణోగ్రత, వర్షపాతం స్థిరంగా పెరిగినట్లు ఓ పరిశోధనా కేంద్రం విడుదల చేసిన నివేదికలో తేలింది. చైనాకు చెందిన టిబెట్‌ స్వయంప్రతిపత్త వాతావరణ కేంద్రం, ప్రాంతీయ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్ల పరిశోధక కేంద్రంలు సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి. గ్లోబల్‌వార్మింగ్‌ కారణంగా టిబెట్‌ వాతావరణంలో ఓ వైపు వేడి, మరోవైపు వర్షపాతమూ పెరిగినట్లుగా ఆ నివేదిక పేర్కొంది. ఈ మార్పులను రెండు వైపులా పదునున్న కత్తిగా నిపుణులు పోల్చారు. ఈ పరిస్థితి టిబెట్‌లో వ్యవసాయానుకూల వాతావరణానికి నాంది పలుకుతుంది.అయితే సమయం గడుస్తున్న కొద్దీ ఇది మరింత ప్రమాదానికి దారి తీయనుందని వారు అభిప్రాయపడ్డారు. గడిచిన మూడున్నర దశాబ్దాలుగా మే నుంచి సెప్టెంబరు మధ్య(వరద సీజన్‌)లో స్థిరంగా ఉష్నోగ్రతలు పెరుగుతున్నాయి. 1981 నుంచి 2016 మధ్య సగటు ఉష్ణోగ్రతలో దశాబ్దానికి 0.3 డిగ్రీల సెంటిగ్రేడ్‌ చొప్పున పెరుగుదల నమోదైనట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది వరద సీజన్‌లో సగటు ఉష్ణోగ్రత 11.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇది 0.44 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువ. మరోవైపు ఈ ఏడాది సగటు వర్షపాతం 445.1ఎంఎంగా నమోదైంది. మిగిలిన ఏళ్లతో పోల్చుకుంటే ఇది 62. 4 ఎంఎం ఎక్కువ అని నివేదిక వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com