ప్రస్తుతానికి పర్లేదు...భవిష్యత్తులో ప్రమాదం
- December 11, 2016
ప్రపంచ పైకప్పుగా పేరొందిన టిబెట్లో సగటు ఉష్ణోగ్రత, వర్షపాతం స్థిరంగా పెరిగినట్లు ఓ పరిశోధనా కేంద్రం విడుదల చేసిన నివేదికలో తేలింది. చైనాకు చెందిన టిబెట్ స్వయంప్రతిపత్త వాతావరణ కేంద్రం, ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ల పరిశోధక కేంద్రంలు సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి. గ్లోబల్వార్మింగ్ కారణంగా టిబెట్ వాతావరణంలో ఓ వైపు వేడి, మరోవైపు వర్షపాతమూ పెరిగినట్లుగా ఆ నివేదిక పేర్కొంది. ఈ మార్పులను రెండు వైపులా పదునున్న కత్తిగా నిపుణులు పోల్చారు. ఈ పరిస్థితి టిబెట్లో వ్యవసాయానుకూల వాతావరణానికి నాంది పలుకుతుంది.అయితే సమయం గడుస్తున్న కొద్దీ ఇది మరింత ప్రమాదానికి దారి తీయనుందని వారు అభిప్రాయపడ్డారు. గడిచిన మూడున్నర దశాబ్దాలుగా మే నుంచి సెప్టెంబరు మధ్య(వరద సీజన్)లో స్థిరంగా ఉష్నోగ్రతలు పెరుగుతున్నాయి. 1981 నుంచి 2016 మధ్య సగటు ఉష్ణోగ్రతలో దశాబ్దానికి 0.3 డిగ్రీల సెంటిగ్రేడ్ చొప్పున పెరుగుదల నమోదైనట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది వరద సీజన్లో సగటు ఉష్ణోగ్రత 11.9 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.
సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇది 0.44 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. మరోవైపు ఈ ఏడాది సగటు వర్షపాతం 445.1ఎంఎంగా నమోదైంది. మిగిలిన ఏళ్లతో పోల్చుకుంటే ఇది 62. 4 ఎంఎం ఎక్కువ అని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







