జెట్ ఎయిర్వేస్ వినూత్న సేవలు
- December 12, 2016
కార్లు, టీవీలు, ఏసీలు, స్మార్ట్ఫోన్లే కాదు.. ఇప్పుడు విమాన టికెట్ను కూడా ఈఎంఐ ఆప్షన్లో పొందొచ్చు. ప్రముఖ విమానయాన సంస్థ 'జెట్ ఎయిర్వేస్' తాజాగా విమాన ప్రయాణానికి ఈఎంఐ ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. సంస్థ దీనికోసం పలు బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 'రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ విధానంలో జరిగే లావాదేవీలు పెరుగుతున్నాయి.అందుకే ప్రయాణికులకు మేం కూడా ఈఎంఐ పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం' అని జెట్ ఎయిర్వేస్ చీఫ్ కమర్షియల్ అధికారి జయరాజ్ వివరించారు.సంస్థ వెబ్సైట్, మొబైల్ యాప్లో విమాన టికెట్ను బుకింగ్ చేసుకునే సమయంలో యాక్సిస్, హెచ్ఎస్బీసీ, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, కొటక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల క్రెడిట్ కార్డులను కలిగిన వారికి ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈఎంఐ చెల్లింపుల గడువు 3, 6, 9, 12 నెలలుగా ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









