స్వదేశానికి: అనారోగ్యంతో మధ్యలో దిగిన భారత వలసదారుడు

- December 13, 2016 , by Maagulf
స్వదేశానికి: అనారోగ్యంతో మధ్యలో దిగిన భారత వలసదారుడు

మనామా: రియాద్‌ నుంచి ముంబైకి వెళుతున్న ఓ భారతీయ వలసదారుడు, అనారోగ్యంతో బాధపడుతుండడంతో బహ్రెయిన్‌లో అతనికి వైద్య చికిత్స అందించారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైట్‌లో వెళుతుండగా అతనికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. దాంతో, బహ్రెయిన్‌లో దించివేసి, వైద్య చికిత్స అందించడం జరిగింది. బాధితుడు కోలుకోవడంతో, తిరిగి అతని కేరళలోని సొంత ప్రాంతానికి తరలించారు. 51 ఏళ్ళ దేవరాజన్‌కి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా బహ్రెయిన్‌ నుంచి సరాసరి కాలికట్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించినట్లు ఓ సామాజిక కార్యకర్త చెప్పారు. పెరాలసిస్‌తో బాధపడ్తున్న ఆ వ్యక్తి ఇండియాకి చేరుకోగానే, అట్నుంచటు ఆసుపత్రికి తరలిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com