వాషింగ్టన్‌లో మృత్యువుతో పోరాడుతూ మృతి చెందిన తెలుగు ఉద్యోగి

- December 14, 2016 , by Maagulf
వాషింగ్టన్‌లో మృత్యువుతో పోరాడుతూ మృతి చెందిన తెలుగు ఉద్యోగి

భద్రాద్రి జిల్లా దమ్మపేటకు చెందిన అత్యం సునీల్ (36) అమెరికాలో కొలనులో పడి సోమవారం మృతి చెందాడు. టీఆర్ఎస్ నేత అత్యం శేఖరం కుమారుడు సునీల్ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా వాషింగ్టన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.  సునీల్ పనిచేసే కంపోనీ వారాంతంలో ఉద్యోగుల్లో ఒక జంటను లాటరీ పద్దతిలో ఎంపిక చేసి విహారయాత్రకు పంపుతుంది.  ఇలా కుటుంబంతో శుక్రవారం హవాయి ఐల్యాండుకు వెళ్ళగా అక్కడ ఈతకొలను ఒడ్డున నడిచి వెళ్తూ కాలు జారి కొలనులో పడిపోయాడు అతడికి ఈత రాకపోవడంతో అక్కడ ఉన్నవారు వెంటనే కొలనులో దిగి సునీల్‌ను బయటకు తీసుకువచ్చారు.  అయితే అప్పటికే సునీల్ కోమాలోకి వెళ్ళిపోయాడు.  బ్రైన్ సెల్స్ దెబ్బతిన్నాయని అతనికి చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.  వారంరోజులుగా వైద్యం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com