వాషింగ్టన్లో మృత్యువుతో పోరాడుతూ మృతి చెందిన తెలుగు ఉద్యోగి
- December 14, 2016
భద్రాద్రి జిల్లా దమ్మపేటకు చెందిన అత్యం సునీల్ (36) అమెరికాలో కొలనులో పడి సోమవారం మృతి చెందాడు. టీఆర్ఎస్ నేత అత్యం శేఖరం కుమారుడు సునీల్ సాప్ట్వేర్ ఇంజనీర్గా వాషింగ్టన్లో ఉద్యోగం చేస్తున్నాడు. సునీల్ పనిచేసే కంపోనీ వారాంతంలో ఉద్యోగుల్లో ఒక జంటను లాటరీ పద్దతిలో ఎంపిక చేసి విహారయాత్రకు పంపుతుంది. ఇలా కుటుంబంతో శుక్రవారం హవాయి ఐల్యాండుకు వెళ్ళగా అక్కడ ఈతకొలను ఒడ్డున నడిచి వెళ్తూ కాలు జారి కొలనులో పడిపోయాడు అతడికి ఈత రాకపోవడంతో అక్కడ ఉన్నవారు వెంటనే కొలనులో దిగి సునీల్ను బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే సునీల్ కోమాలోకి వెళ్ళిపోయాడు. బ్రైన్ సెల్స్ దెబ్బతిన్నాయని అతనికి చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. వారంరోజులుగా వైద్యం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







