ఇక రహదారుల వెంట నో మందు
- December 16, 2016
మద్యం వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు ఆరోగ్యం పాడైపోతుంటే.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో మద్యం తాగి వాహనాలు నడపవద్దంటూ ప్రచారం ముమ్మరం చేశారు. అయినా వాటిని పట్టించుకునేవారే కరువయ్యారు. ఇప్పటికీ యధేచ్ఛగా మద్యం తాగి వాహనాలు నడిపేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో.. జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాలను మూసివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. వెంటనే జాతీయ రహదారుల వెంబడి ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని ఆదేశించింది.
వాటి లైసెన్సులను కూడా రద్దు చేయాలని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత కాలపరిమితి ముగిసే వరకూ కొనసాగించాలని మినహాయింపు ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత కొత్త లైసెన్సులు ఇవ్వొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. జాతీయ రహదారికి 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండేందుకు వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక.. రహదారుల వెంబడి ఉన్న లిక్కర్ బ్యానర్లు, ప్రకటనలను కూడా తొలగించాలని స్పష్టంచేసింది. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పోలీసు అధికారులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. వాహనదారుల భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







