చెన్నైలో అత్యవసరంగా దిగిన ఎమిరేట్స్ విమానం
- September 05, 2015
దుబాయ్ నుంచి కౌలాలంపూర్ కు బయలు దేరిన ఎమిరేట్స్ విమానం శనివారం చెన్నై విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ అయ్యింది. దుబాయ్ నుంచి కౌలాలంపూర్ కు వెళుతున్న ఈకె -346 విమానంలో దుబాయ్ కి చెందిన 61 ఏళ్ల ప్రయాణికుడికి ఆకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ల్యాండింగ్ చేయాల్సిందిగా కంట్రోల్ రూమ్ కు ఆదేశాలు పంపారు. ఈమేరకు అధికారుల అనుమతితో విమానాన్ని చెన్నై విమానశ్రయంలో దింపివేశారు. బాధితుడికి తొలుత ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆ తరువాత విమానం కౌలాలంపూర్ కు బయలుదేరింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









