చెన్నైలో అత్యవసరంగా దిగిన ఎమిరేట్స్ విమానం
- September 05, 2015
దుబాయ్ నుంచి కౌలాలంపూర్ కు బయలు దేరిన ఎమిరేట్స్ విమానం శనివారం చెన్నై విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ అయ్యింది. దుబాయ్ నుంచి కౌలాలంపూర్ కు వెళుతున్న ఈకె -346 విమానంలో దుబాయ్ కి చెందిన 61 ఏళ్ల ప్రయాణికుడికి ఆకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ల్యాండింగ్ చేయాల్సిందిగా కంట్రోల్ రూమ్ కు ఆదేశాలు పంపారు. ఈమేరకు అధికారుల అనుమతితో విమానాన్ని చెన్నై విమానశ్రయంలో దింపివేశారు. బాధితుడికి తొలుత ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆ తరువాత విమానం కౌలాలంపూర్ కు బయలుదేరింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







