సౌదీ-యెమన్ సరిహద్దుల్లో 5గురు బహ్రెయిన్ సైనికుల మృతి
- September 05, 2015
దక్షణ సౌదీ అరేబియాలో ఈ శుక్రవారం యుద్ధంతో అట్టుడుకుతున్న పొరుగు దేశమైన యెమన్ సరిహద్దు రక్షణకు నియోగించబడిన ఐదుగురు సైనికులు మరణించినట్టు తెలియవచ్చింది. గత మార్చి నుండి రియాద్ లో ప్రవాసముంటున్న యెమన్ అధ్యక్షుడు అబెద్రబ్బొ మన్సూర్ హాది నాయకత్వాన్ని తిరిగి నిలబెట్ట దానికి సౌదీ నేతృత్వంలో నడపబడుతున్న అరబ్ సంకీర్ణ సమితిలో బహ్రైన్ కూడా ఒక సభ్యదేశం; కాగా బహ్రైనీ సాయుధ దళం చేసిన ఒక ప్రకటనలో సదరు సైనికులు సౌదీ సామ్రాజ్యం యొక్క దక్షిణ సరిహద్దును కాపాడే యత్నంలో ప్రాణాలు కోల్పోయారని మాత్రమే ప్రకటించారు; అక్కడ పరిస్తితుల వివరాలు తెలియరాలేదు. ఇంకా, అదేరోజు తూర్పు యెమన్ లోని ఒక ఆయుధ డిపోలో జరిగిన ప్రేలుడులో, మరో సభ్యదేశమైన 22 మంది యూ. ఏ. ఈ. సైనికులు మృతిచెందారు. యెమన్ ప్రభుత్వం దాన్ని ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అని చెప్తుండగా, తిరుగుబాటు దళాలు, తాము చేసిన రాకెట్ దాడి ఫలితమని ప్రకటించాయి!
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









