షార్జాలో ఇండియన్ స్కూల్ లో 12 వేలమంది విద్యార్థులు

- December 16, 2016 , by Maagulf
షార్జాలో ఇండియన్ స్కూల్ లో 12 వేలమంది విద్యార్థులు

ఎమిరేట్ లో అతిపెద్ద భారత కమ్యూనిటీ పాఠశాల, రానున్న విద్యా సంవత్సరం షార్జాలో  ఇండియన్ స్కూల్ యొక్క ఒక కొత్త శాఖను తెరవడం కోసం సిద్ధమయ్యంది.. 44.3 మిలియన్ డి హెచ్ వ్యయంతో పాఠశాలను అధికారికంగా దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పునరాయి  విజయన్, డిసెంబర్ 22 వ తేదీన ప్రారంభించనున్నారు. అయిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత యుఎఇ కి మొట్టమొదటిసారిగా పర్యటన చేయనున్నారు. ఈ కొత్త పాఠశాల షార్జ లోని రోజా సమీపంలో జువైజ్ ప్రాంతంలో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ స్థలంను సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షార్జా పాలకుడు శ్రీశ్రీ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖ్అసిమి దానంగా  ఈ పాఠశాలకు ఇచ్చారు. ఈ పాఠశాల నిర్వహిస్తున్న ఇండియన్ అసోసియేషన్ షార్జ (ఐఎఎస్), అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,బాలికలకు ఒక పాఠశాలలు అని  బాలలకు మరొకటి విడివిడిగా నిర్మించారు.ఐఏఎస్ అధ్యక్షుడు " మా గల్ఫ్ డాట్ కామ్ " తో  మాట్లాడుతూ, కొత్త పాఠశాల ప్రాజెక్ట్  గత ఒకటిన్నర సంవత్సరాలు జరుగుతున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com