ఖతార్ లో జులై నుండి పడిపోయిన సైకిల్ అమ్మకాలు - వ్యాపారుల దిగాలు
- September 05, 2015
ఖతార్ లో గత సంవత్సరాలతో పోలిస్తే ఈ జులై నెల నుండి సైకిల్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఈ సందర్భంగా ఒక స్పోర్ట్స్ మరియు సైకిల్ స్టోర్స్ సూపర్వైజర్ మాట్లాడుతూ, వేసవిలో అమ్మకాలు తగ్గడం సామాన్యమేనని, కానీ ఈసారి మరీ రోజుకు 5 కంటే తక్కువగా అమ్మకాలు జరగడం, ఎప్పుడూ లేదని వాపోయారు. దేశంలో సైకిల్ స్టోర్స్ సంఖ్య పెరగడంతో, వాటి మధ్య పోటీ పెరిగి వివిధ బ్రాండ్ల సైకిళ్లను తక్కువ రేటుకే అందించడం ఒక కారణమని ఆయన అన్నారు. ఇంకా చాలా కాలం నుండి సైక్లింగ్ చేస్తున్న వారు, తమ పాత సైకిళ్లను సోషల్ మీడియా ద్వారా అమ్మడం కూడా మరో కారణం గా కనిపిస్తోంది. మరో దుఖాన యజమాని మాట్లాడుతూ, వినియోగదారులు ఆన్ లైన్లో సైకిళ్లు కొంటున్నారనీ, వారిని ఆకర్షించడానికి తాము అనేక ప్రమోషన్ లు, ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నామని, రానున్న శీతాకాలంలో తమ వ్యాపారం పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







