3 రాష్ట్రాలలో ఎయిర్ అంబులెన్స్ సేవలు
- December 16, 2016
అత్యవసర సమయాల్లో రోగులకు వైద్య సేవలు అందించేందుకు, వారిని తరలించేందుకు 'ఏవియేటర్స్ ఎయిర్ రెస్క్యూ' సంస్థ చేపట్టిన గగనతల అంబులెన్స్ సేవలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం బెంగళూరులో ప్రారంభించారు. ఈ అంబులెన్స్లతో దక్షిణాదిలోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అత్యవసర సమయంలో రోగులకు సేవలు అందిస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ శర్మ తెలిపారు. 'ఎయిర్బస్ హెలికాప్టర్ హెచ్-130'లను గగనతల అంబులెన్స్లుగా వినియోగిస్తామని, రోగులకు అత్యవసర చికిత్స అందించేలా వీటిని రూపుదిద్దామని పేర్కొన్నారు.
''ప్రతి హెలికాప్టర్లో ఇద్దరు పైలట్లు, ముగ్గురు వైద్య నిపుణులు ఉంటారు. స్ట్రెచర్, ప్రాణవాయువు, ఇతర వైద్య ఉపకరణాలు ఉంటాయి. ప్రస్తుతానికి మూడు హెలికాప్టర్లు దక్షిణాదిలో ఎంపిక చేసిన స్థావరాలను కేంద్రాలుగా చేసుకుని సేవలు అందిస్తాయి'' అని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









