తెలుగుతేజం పీవీ సింధు పరాజయం పాలైంది

- December 17, 2016 , by Maagulf
తెలుగుతేజం పీవీ సింధు పరాజయం పాలైంది

బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీ సెమీస్‌లో ఒలింపిక్‌ రజత పతక విజేత, తెలుగుతేజం పీవీ సింధు పరాజయం పాలైంది. దక్షిణ కొరియాకు చెందిన సంగ్‌ హ్యూన్‌ 21-15, 18-21, 21-15 తేడాతో సింధూపై గెలిచి ఫైనల్‌ల్లోకి దూసుకెళ్లింది.
మ్యాచ్‌ సాంతం హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌లో ఆధిక్యం పదేపదే చేతులు మారింది. నువ్వానేనా అన్నట్లు సాగిన గేమ్‌లో సంగ్‌హ్యూన్‌.. సింధును కోర్టుకు ఇరువైపులా తిప్పించి 21-15తో విజయం పొందింది. అయితే కీలకమైన రెండో గేమ్‌లో సింధు పుంజుకొంది. 10-10, 14-14, 18-18తో సమం చేస్తూ ప్రత్యర్థి ప్రతిఘటించినా అద్భుత స్మాష్‌లతో 21-18తో రెండో గేమ్‌ గెలుచుకొంది.
మూడో గేమ్‌లోనూ ఇద్దరూ పోటాపోటీగా ఆడినా సింధు కొన్ని అనవసర తప్పిదాలు చేయడంతో హ్యూన్‌ 21-15తో మ్యాచ్‌ గెలిచి ఫైనల్‌కు చేరుకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com