డిశ్చార్జి కానున్నారు సుష్మాస్వరాజ్!
- December 19, 2016
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. ఈ నెల 10న ఆమెకు ఇక్కడి ఎయిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవడంతో ఆమెను డిశ్చార్జి చేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
20ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్న సుష్మాస్వరాజ్ నవంబర్ 7న కిడ్నీ విఫలమవడంతో ఎయిమ్స్లో చేరారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా ఆమె ట్వీట్ల ద్వారా కొందరికి సహాయపడిన సంగతి తెలిసిందే. ఆదివారం కూడా ఓ మహిళ అభ్యర్థనను మన్నించి ఆమె భర్త మృతదేహాన్ని జపాన్ నుంచి స్వదేశం తెప్పించేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ మేరకు ఆస్పత్రి నుంచే ఏర్పాట్లు చేశారు. వినూత్న రీతిలో ట్విట్టర్ డిప్లొమసీ ద్వారా పనులు సాధిస్తున్న సుష్మను ఇటీవలే ఫారెన్ పాలసీ మ్యాగజైన్ గ్లోబల్ థింకర్స్ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్









