58,0000 ఇండియన్స్కి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్
- December 19, 2016
గడచిన రెండేళ్ళలో గల్ఫ్ దేశాల్లో ఎంప్లాయ్మెంట్ కోసం 58,000 మంది భారతీయ వర్కర్స్కి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లభించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి వికె సింగ్ సమాధానమిస్తూ ఈ వివరాల్ని వెల్లడించారు. సౌదీ అరేబియాలో ఎంప్లాయర్స్ నుంచి ఎదురవుతున్న సమస్యలపై ఇండియన్ వర్కర్స్ పలు ఫిర్యాదులు చేశారనీ, వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని ఆయన తెలిపారు. 2014 సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లభించిన భారతీయ మైగ్రెంట్ డొమెస్టిక్ వర్కర్స్ సంఖ్య 58,163 అని ఆయన పేర్కొన్నారు. 207 దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 31.73గా ఉందని, ఇందులో 13.45 మిలియన్ల మంది ఎన్ఆర్ఐలు కాగా, 17.85 మంది ఇండియన్ ఆరిజన్ కలవారని సమాధానంలో ప్రస్తావించారు కేంద్ర మంత్రి. ప్రభుత్వం 1,121 ఫిర్యాదుల్ని డిసెంబర్ 2012 నుంచి ఇప్పటిదాకా అందుకుందనీ, అందులో 973 ఫిర్యాదుల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రిఫర్ చేసినట్లు తెలిపారు. విడాకులు మంజూరయినట్లయితే పిల్లల పాస్పోర్ట్ విషయంలో తల్లిదండ్రులిద్దరి సంతకం కంపల్సరీ కాదనీ, ఎవరో ఒకరి అనుమతి ఉంటే సరిపోతుందని అన్నారాయన.
తాజా వార్తలు
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం









