డ్రగ్స్పై యుద్ధం అత్యవసరం: క్రౌన్ ప్రిన్స్
- December 19, 2016
రియాద్: పౌరుల్ని అలాగే నివాసితుల్ని నాశనం చేసే డ్రగ్స్ విషయంలో యుద్ధం అనివార్యం, అత్యవసరం అని నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ కమిషన్ ప్రెసిడెంట్, అలాగే క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ మొహమ్మద్ బిన్ నైఫ్ పునరుద్ఘాటించారు. నేషనల్ కమిషన్ ఫర్ డ్రగ్ కంట్రోల్ సమావేశంలో మాట్లాడిన మొహమ్మద్ బిన్ నైఫ్, డ్రగ్స్పై పోరు ఆవశ్యకతను తెలియజేశారు. వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేస్తుందని, సమాజంపై డ్రగ్స్ తీవ్ర ప్రభావం చూపించడం దారుణమని ఆయన అన్నారు. పోలీస్ అలాగే కస్టమ్స్ అధికారులు, స్మగ్లర్స్ని అరెస్ట్ చేయడం, డ్రగ్ డీలర్స్కి చెక్ పెట్టడం వంటి విషయాల్లో చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను అభినందించారు. డ్రగ్స్కి వ్యతిరేకంగా అవగాహనా కార్యక్రమాల్ని ఇంకా ముమ్మరం చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నిబ్రాస్ అకాడమీ ఫర్ ఇ-ట్రెయినింగ్, నిబ్రాస్ స్పోర్ట్స్ స్టార్స్ మరియు నిబ్రాస్ అప్లికేషన్స్ అనే మూడు ఇ-ప్రోగ్రామ్స్ని క్రౌన్ ప్రిన్స్ ప్రారంభించారు. డ్రగ్స్పై యుద్ధంలో భాగంగా కస్టమ్స్ అలాగే పోలీసులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని క్రౌన్ ప్రిన్స్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







