రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి మరొకరికి గాయాలు
- December 19, 2016
షార్జా: యూఏఈ మనీ ఎక్స్ఛేంజ్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ మృతి చెందిన ఘటన షార్జాలో చోటు చేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి మనీ ఎక్స్ఛేంజ్లోకి దూసుకెళ్ళింది. ఈ ఘటనతో సెక్యూరిటీ గార్డ్ మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బ్రేక్ వేయాల్సింది పోయి, యాక్సెలరేటర్పై డ్రైవర్ కాలు వేయడంతో కారు వాహనం అదుపు తప్పింది. ప్రమాద సమయంలో డ్రైవర్ పూర్తిగా డ్రైవింగ్ మీద దృష్టిపెట్టలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అదృష్టవశాత్తూ స్టాఫ్ ఎవరూ చనిపోవడంగానీ, గాయపడటంగానీ జరగలేదనీ, సెక్యూరిటీ గార్డ్ మృతి చెందడం అలాగే అటువైపుగా వెళుతున్న ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలవడం దురదృష్టకరమని యూఏఈ ఎక్స్ఛేంజ్ వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







