భారత జూనియర్ హాకీ జట్టుకు భారీ నజరానా

- December 20, 2016 , by Maagulf
భారత జూనియర్ హాకీ జట్టుకు భారీ నజరానా

15 సంవత్సరాల తర్వాత భారత జూనియర్ హాకీ జట్టు 'జూనియర్ వరల్డ్ కప్' గెలుపొందిన సంగతి తెలిసిందే. ఫైనల్లో 2-1 తేడాతో బెల్జియంను ఓడించింది. అయితే ఈ ఘనవిజయాన్ని సాధించిన భారత జట్టులోని పంజాబ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలను బహుమానం ఇవ్వనుంది పంజాబ్ రాష్ట్రం. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. భారత జూనియర్ హాకీ జట్టులో హర్మన్‌ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్, హర్జీత్ సింగ్, గురిందర్ సింగ్ వంటి పంజాబీ ఆటగాళ్లకు ఈ బహుమానం అందనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com