శుక్రవారం ప్రారంభం కానున్న నూతన మస్జిద్..
- December 21, 2016
మనామా: దివంగత షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పేరిట నిర్మింపబడిన మస్జిద్ ను శ్రీశ్రీ షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా శుక్రవారం ( రేపు ) అధికారికంగా ప్రారంభించనున్నారు.డియార్ అల్ మూహ్యాయరాక్ హార్ట్ లోపల ఉన్న అరబ్-ఇస్లామిక్ నిర్మాణం ప్రేరణగా ప్రత్యేక సాంకేతిక నమూనాలతో దివంగత షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మస్జిద్ నిర్మితమయ్యంది. మస్జిద్ కళాత్మక నమూనాలు అలంకరించిన ఒక విశేష గోపురం మరియు 45-మీటర్ల ఎత్తులో ఒక స్తంభం కలిగి ఉంటుంది.నగరం యొక్క ప్రధాన ద్వారం సమీపంలో మాస్టర్ ప్రణాళిక ప్రకారం డియార్ అల్ మూహ్యాయరాక్ మరియు పరిసర ప్రాంతాలు భక్తులు సులభంగా హాజరయ్యేందుకు ఈ మస్జిద్ అనువుగా ఉంది. సుమారు 1,050 భక్తులు ఇందులో ప్రార్ధనలు చేసుకొనేందుకు వసతి ఉంది.వివిధ ఆధునిక సమాజ కేంద్రాలు కూడా మసీదు సమీపంలో ఉన్నాయి.ఇక్కడ ఖుర్ఆన్ బోధనలు మరియు ఇస్లామిక్ అధ్యయనాలు అందిస్తుంది. ఒక కార్యక్రమాలు నిర్వహించుకొనే ప్రాంగణం సైతం ఈ మసీదు సమీపంలో ఉంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







