ఇరాక్‌లో వరుస బాంబు పేలుళ్లు 23 మంది మృతి

- December 22, 2016 , by Maagulf
ఇరాక్‌లో వరుస బాంబు పేలుళ్లు 23 మంది మృతి

ఇరాక్‌లోని మోసుల్‌ నగరంలో సంభవించిన మూడు వరుస బాంబు పేలుళ్లలో 23 మంది మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. గాగ్‌జైల్‌లోని మార్కెట్‌ సమీపంలో మూడు కార్లలో బాంబు అమర్చి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో 15 మంది పౌరులు, 8 మంది పోలీసులు మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
గత కొద్దిరోజులుగా మోసుల్‌లో ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రవాదులకు,ఇరాకీ దళాలకు మధ్య భీకరపోరు జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com