ఖబడ్దార్ పన్ను ఎగవేస్తే..
- December 23, 2016
పన్ను ఎగవేతదారులపై ఐటీ శాఖ నిఘా పెంచుతోంది. 2014-15 సంవత్సరంలో భారీ ఎత్తున ఆర్ధిక లావాదేవీలు జరిపి కూడా 2015-16 సంవత్సరానికి తమ ట్యాక్స్ రిటర్న్ లు సమర్పించని మరో 68 లక్షల మందిని ఐటీ శాఖ గుర్తించింది. వీరిపై త్వరలో చర్యలు తీసుకోనుంది. వీరి సమాచారాన్ని బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి ఈ శాఖలోని నాన్-ఫైలర్స్ మానిటరింగ్ విభాగం సేకరించింది.
హై వాల్యూ లావాదేవీలు జరిపి కూడా తమ ఆదాయపు పన్ను వివరాలను దాఖలు చేయనివారిని గుర్తించడమే ఈ విభాగం పని. డేటా మ్యాచింగ్ లో ఇలాంటి వారిని సుమారు 68 లక్షల మందిని గుర్తించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. వీరికి త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు.
తమ అసలైన ఆదాయాన్ని వెల్లడించి సకాలంలో పన్నులు చెల్లించకపోతే ఖబడ్దార్ అని ఐటీ శాఖ హెచ్చరిస్తోంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







