ఖబడ్దార్ పన్ను ఎగవేస్తే..

- December 23, 2016 , by Maagulf
ఖబడ్దార్ పన్ను ఎగవేస్తే..

పన్ను ఎగవేతదారులపై ఐటీ శాఖ నిఘా పెంచుతోంది. 2014-15 సంవత్సరంలో భారీ ఎత్తున ఆర్ధిక లావాదేవీలు జరిపి కూడా 2015-16 సంవత్సరానికి తమ ట్యాక్స్ రిటర్న్ లు సమర్పించని మరో 68 లక్షల మందిని ఐటీ శాఖ గుర్తించింది. వీరిపై త్వరలో చర్యలు తీసుకోనుంది. వీరి సమాచారాన్ని బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి ఈ శాఖలోని నాన్-ఫైలర్స్ మానిటరింగ్ విభాగం సేకరించింది.
హై వాల్యూ లావాదేవీలు జరిపి కూడా తమ ఆదాయపు పన్ను వివరాలను దాఖలు చేయనివారిని గుర్తించడమే ఈ విభాగం పని. డేటా మ్యాచింగ్ లో ఇలాంటి వారిని సుమారు 68 లక్షల మందిని గుర్తించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. వీరికి త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు.

తమ అసలైన ఆదాయాన్ని వెల్లడించి సకాలంలో పన్నులు చెల్లించకపోతే ఖబడ్దార్ అని ఐటీ శాఖ హెచ్చరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com