హైదరాబాద్ లో ఏటీఎంలు బంద్..
- December 24, 2016
బ్యాంకులకు సెలవు.. తెరుచు కోని ఏటీఎంలతో శనివారం నగరవాసుల కరెన్సీ కష్టాలు రెట్టింపయ్యాయి. ఏటీఎంలలో నగదు వేస్తారని రోజంతా ఏటీఎం చుట్టూ తిరిగిన వా రికి నిరాశే మిగిలింది. ఏటీఎంల్లో నగదు లేక.. బ్యాంకులు తెరుచుకోక నగదు కోసం ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పెద్దనోట్లు రద్దయి 46 రోజులు గడుస్తున్నా కరెన్సీ కష్టాలు తీరకపోవడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పలు ప్రాంతాల్లో 90 శాతం ఏటీఎంలు తెరుచుకో కపోవడంతో ఏటీఎంల ముందు పలువురు చిరువ్యాపారాలు నిర్వహి స్తున్నారు. కోఠి, ఆబిడ్స్, చార్మినార్ ప్రాంతాల్లో ఏటీఎంలు తెరుచుకో కపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులు పనిచేయ నప్పుడైనా ఏటీఎంల్లో నగదు వేసేలా అధికారులు చర్యలు తీసుకో వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







