తిరుపతి వేదికగా రేపే గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల
- December 24, 2016ప్రముఖ నటుడు, నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిని సంక్రాంతికి విడుదల చేస్తామని ఆ చిత్ర సమర్పకుడు బిబో శ్రీనివాస్, నిర్మాత రాజీవ్రెడ్డి వెల్లడిం చారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ పాఠశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఈ చిత్ర ఆడియో వేడుకను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శనివారం తిరుపతి ఎమ్మెల్యే సుగుణతో కలిసి మైదానాన్ని పరిశీలించి, ఏర్పాట్లపై చర్చించారు. ఆడియో వేడుకకు ఎంతమంది వస్తారు? ఎంట్రీలెలా? వీఐపీ బ్యారికేడ్లు, స్టేజ్ నిర్మాణం వంటివాటిపై ఆడియో వేడుక నిర్వహిస్తున్న జై మీడియా ఈవెంట్ ప్రతినిధి నరేంద్రరాజుతో సమీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా 800 థియేటర్లలో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సినిమా ఉంటుందన్నారు. ఆడియో వేడుకకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీనియర్నటి హేమమాలినితో పాటు చిత్ర పరిశ్రమలోని నటీనటులు పెద్దఎత్తున హాజరవుతారన్నారు.
అందరూ ఆహ్వానితులేనని.. వీవీఐపీలకు మాత్రమే ఎంట్రీ పాసులు ఇస్తున్నామన్నారు. ఆదివారం సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతిలోని ఓ హోటల్ వద్ద నుంచి 500 కార్లు, 1000 ద్విచక్ర వాహనాలతో బాలకృష్ణ భారీ ర్యాలీగా ఆడియో వేదిక వద్దకు చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు శ్రీధర్వర్మ, రవినాయుడు, నరసింహయాదవ్, బాల కృష్ణ ఫ్యాన్స్ సతీష్, మనోహర్రెడ్డి, సురేంద్ర, కోరా పృథ్వీచౌదరి, జగన్, రవితేజ, తిలక్, షఫీ, భాస్కర్రాజు, హేమంత్రాయల్, చిత్ర బృందం, పోలీసులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!