2017 జాయ్ ఆఫ్ లివింగ్: యూఏఈ ప్రెసిడెంట్..
- December 25, 2016
యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 2017వ సంవత్సరాన్ని 'ఇయర్ ఆఫ్ గివింగ్'గా ప్రకటించారు. సమాజానికి తిరిగివ్వాలనే గొప్ప ఉద్దేశ్యం దీని వెనుక ఉంది. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, సామాజిక బాధ్యత కింద ప్రైవేట్ సెక్టార్, సేవా కార్యక్రమాలు ప్రారంభించేలా ప్రచారం కల్పించడం ముఖ్యం. ఇది 'ఇయర్ ఆఫ్ 2017'కి సంబంధించి మొదటి పిల్లర్. రెండో పిల్లర్ ఏంటంటే, స్పెషలైజ్డ్ వలంటీర్ ప్రోగ్రామ్స్ని నిర్వహించడం ద్వారా సోషల్ డెవలప్మెంట్, కమ్యూనిటీ సర్వీసెస్ని సులభతరం చేయడం. మూడో పిల్లర్, భవిష్యత్ తరాలు, దేశం పట్ల మరింత అంకిత భావంతో వ్యవహరించేలా వారిలో చైతన్యం పెంచడం. యూఏఈలో ఛారిటీ కార్యక్రమాలపై ఇప్పటికే అవగాహన అభినందించదగ్గ స్థాయిలోనే ఉందని, దాన్ని మరింతగా పెంచవలసిన అవసరం ఉందని షేక్ ఖలీఫా అభిప్రాయపడ్డారు. ఖచ్చితమైన లక్ష్యాలతో పై మూడు విభాగాల్లో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. 2016వ సంవత్సరాన్ని 'ఇయర్ ఆఫ్ రీడింగ్'గా ప్రకటించి, లక్ష్యాల్ని చేరుకున్నామని, అలాగే 2017వ సంవత్సరం కోసం నిర్దేశించుకున్న లక్ష్యాల్ని చేరుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు షేక్ ఖలీఫా.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







