పాక్లో కల్తీ మద్యం సేవించి 32 మంది మృతి..
- December 27, 2016
పాకిస్థాన్లో కల్తీ మద్యం సేవించి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. టొబా టెక్ సింగ్ నగరంలోని ఓ క్రైస్తవ కాలనీలో ఈ విషాదం జరిగింది. క్రిస్మస్ పండుగ ముందు రోజు రాత్రి వేడుకలో భాగంగా.. కొందరు వ్యక్తులు తయారు చేసిన మద్యాన్ని స్థానికులు సేవించారు. సోమవారం ఉదయానికి వారిలో కొందరు ప్రాణాలు విడవగా.. మరికొంత మంది ఆసుపత్రిపాలయ్యారు. బాధితుల్లో ఎక్కువ మంది క్రైస్తవులే. ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. సదరు మద్యం తయారు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్లో మద్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఇస్లాం మినహా ఇతర మతస్థులకు కొన్ని సడలింపులున్నాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







