విమానాల్లో వైఫై సర్వీసులకు అనుమతివ్వండి..

- December 28, 2016 , by Maagulf
విమానాల్లో వైఫై సర్వీసులకు అనుమతివ్వండి..

అసోచామ్‌ వినతి ∙ప్రధానికి లేఖ 
న్యూఢిల్లీ: విమానాల్లో వైఫై సర్వీసులను అనుమతించాలని అసోచామ్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఇలా చేయడం వల్ల విమానాల్లో ప్రయాణించేవాళ్లు అనుసంధానమై ఉంటారని, అంతే కాకుండా విమాన భద్రతను మరింతగా మెరుగుపరుస్తుందని వివరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి అసోచామ్‌ ప్రధాన కార్యదర్శి డి. ఎస్‌. రావత్‌ ఒక లేఖ రాశారు. ప్రస్తుతం పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ తమ విమానాల్లో వైఫై సర్వీసులనందజేస్తున్నాయని, కానీ భారత గగనతలంలోకి రాగానే మన దేశ నియమనిబంధనల కారణంగా వీటిని అపేస్తున్నాయని తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com