చిన్నమ్మకే పట్టం..

- December 28, 2016 , by Maagulf
చిన్నమ్మకే పట్టం..

అన్నాడీఎంకేలో అంతా ఊహించినట్టుగానే జరిగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్‌ ఎన్నికయ్యారు. గురువారమిక్కడ ప్రారంభమైన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శశికళ నాయకత్వంలో పనిచేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికైనట్టు అన్నాడీఎంకే పార్టీ వెబ్‌ సైట్‌ లో అధికారికంగా ప్రకటించారు. శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు సమావేశం ముగిసిన తర్వాత సీఎం పన్నీరు సెల్వం ప్రకటించారు. జనవరి 2న అధికారికంగా శశికళ పార్టీ పగ్గాలు చేపడతారని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com