అరుణాచల్ ప్రదేశ్ సీఎం సస్పెండ్!
- December 30, 2016
అరుణాచల్ ప్రదేశ్లో రాజకీయ అనిశ్చితి ఇప్పట్లో తొలిగేట్టు కనిపించడం లేదు. గతేడాది డిసెంబర్ నుంచి మళ్లీ డిసెంబర్లోగా అక్కడ రాజకీయ సమీకరణాలు చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. తాజాగా ముఖ్యమంత్రి పెమా ఖండూతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు అధికార పార్టీ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పీపీఏ) ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లఘిస్తున్నారంటూ గురువారం సాయంత్రం వీరిపై వేటువేసింది. పెమా ఖండూతో పాటు మరో 42 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు గత సెప్టెంబర్లోనే గంపగుత్తగా వచ్చి పీపీఏలో చేరిన సంగతి తెలిసిందే. సస్పెన్సన్ వేటుతో ఇకపై పెమా ఖండూకి శాసనసభా పక్ష నేతగా పార్టీ తరపున ఎలాంటి అధికారం ఉండబోదని పీపీఏ అధ్యక్షుడు కాఫియా బెంజియా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







