అరుణాచల్ ప్రదేశ్ సీఎం సస్పెండ్!
- December 30, 2016
అరుణాచల్ ప్రదేశ్లో రాజకీయ అనిశ్చితి ఇప్పట్లో తొలిగేట్టు కనిపించడం లేదు. గతేడాది డిసెంబర్ నుంచి మళ్లీ డిసెంబర్లోగా అక్కడ రాజకీయ సమీకరణాలు చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. తాజాగా ముఖ్యమంత్రి పెమా ఖండూతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు అధికార పార్టీ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పీపీఏ) ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లఘిస్తున్నారంటూ గురువారం సాయంత్రం వీరిపై వేటువేసింది. పెమా ఖండూతో పాటు మరో 42 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు గత సెప్టెంబర్లోనే గంపగుత్తగా వచ్చి పీపీఏలో చేరిన సంగతి తెలిసిందే. సస్పెన్సన్ వేటుతో ఇకపై పెమా ఖండూకి శాసనసభా పక్ష నేతగా పార్టీ తరపున ఎలాంటి అధికారం ఉండబోదని పీపీఏ అధ్యక్షుడు కాఫియా బెంజియా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







