బాలయ్య అభిమానులుకు షాక్ ఇచ్చిన నాగబాబు కామెంట్స్..
- December 30, 2016
2017 సంక్రాంతి పండుగ భారీ సినిమాల రేస్ చిరంజీవి బాలకృష్ణలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ వార్ మెగా నందమూరి అభిమానుల మధ్య చిచ్చు రేపుతోంది. దీనితో 'ఖైదీ' 'శాతకర్ణి' సినిమాల మధ్య నడుస్తున్న పోటీ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు సెన్సార్ కార్యక్రమాలను కూడ పూర్తి చేసుకున్న 'ఖైదీ' నిర్మాతలు రకరకాల ఎత్తుగడలతో సంక్రాంతి రేస్ విజేతగా మారడానికి వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఈ సినిమాల మధ్య రికార్డు కలెక్షన్స్ పోటీతో పాటు ఈ రెండు సినిమాల మధ్య కనీవినీ ఎరుగని థియేటర్స్ వార్ నడుస్తోంది.
ఈ సమయంలో మెగా బ్రదర్ నాగబాబు అభిమానులతో పాటు ప్రేక్షకులను ఉద్దేశించి ఈ సంక్రాంతి సినిమాల మధ్య పోటీ గురించి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి.
'ఒక సినిమా తెరకెక్కడంలో వేల మంది కష్టం ఉంటుంది. మూవీ ఫ్లాప్ అవడం చాలామందిని చాలా బాధపెడుతుంది. ఒక సినిమా హిట్ అవాలని కోరుకోవడం సహజం. కానీ మన సినిమా మాత్రమే ఆడాలని కోరుకోవడం మాత్రం దారుణమే కాదు స్వార్ధం కూడ పరిశ్రమకు ఇది ఏమాత్రం మంచిదికాదు. అభిమానులు మంచి సినిమాలను ఆదరించాలి. ఇప్పుడు నడుస్తున్న ఫ్యాన్ వార్స్ ట్రెండ్ ఏమాత్రం సరికాదు' అంటూ డైరెక్టుగానే అభిమానులకు మెసేజ్ ఇచ్చేశాడు నాగబాబు.
అంతేకాదు 'సంక్రాంతికి అతి పెద్ద పండుగ. ఈ సీజన్ లో మూడు సినిమాలు భారీ సక్సెస్ లు సాధించి బ్లాక్ బస్టర్లుగా నిలిచేందుకు అవకాశం ఉంది. ఈ పండుగ అందరికీ సంతోషంతో పాటు సూపర్ హిట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా' అంటూ నందమూరి ఫ్యాన్స్ కి కూడా విషెస్ చెప్పాడు మెగా బ్రదర్. దీనితో నాగబాబు చేసిన ఈ కామెంట్స్ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. నాగబాబు యధాలాపంగా ఈ మాటలు అన్నాడా? లేదంటే ఈ మాటల వెనుక ఏమైనా వ్యూహాత్మక ఎత్తుగడ ఉందా అన్న కోణంలో చర్చలు సాగుతున్నాయి.
ఏది ఏమైనా నాగబాబు చేసిన కామెంట్స్ అటు మెగా కాంపౌండ్ కు అదే విధంగా నందమూరి అభిమానులకు షాక్ ఇస్తాయి అన్నది వాస్తవం. మరి ఈ కామెంట్స్ పై మెగా కాంపౌండ్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి..
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









