‘మిస్టర్’ మూవీ తొలి పోస్టర్ విడుదల..
- December 30, 2016
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఉన్న శ్రీను వైట్ల వరుస ఫ్లాపులతో చతికిలబడ్డాడు. దాంతో తన టాలెంట్ ని మరోసారి నిరూపించుకునేందుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ విదేశాలకు వెళ్లింది. అక్కడ కీలక పాత్రలపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి పోస్టర్ విడుదల చేయని టీం నిన్న టైటిల్ తో ఉన్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇక ఈ రోజు న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మిస్టర్ మూవీ వరుణ్ తేజ్ కాలి గాయం కారణంగా కొన్నాళ్లు డిలే అయిన సంగతి తెలిసిందే.
మిస్టర్ మూవీకి మిక్కీ జే. మేయర్ తనదైన స్టైల్ లో బాణీలు అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







