బాలీవుడ్ లో రానున్న బంపర్ కాంబో
- January 01, 2017
"అ" అంటే అమితాబ్బచ్చన్, "ఆ" ఆమీర్ఖాన్ ప్రధాన పాత్రల్లో "థగ్స్ ఆఫ్ హిందుస్థాన్" పేరుతో ఓ భారీ చిత్రం రూపొంద నున్న విషయం తెలిసిందే. తమ అసాధారణ నటనతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరుచుకున్నారు. అమితాబ్బచ్చన్, ఆమీర్ఖాన్ కలయికలో వస్తోన్న తొలిచిత్ర మిదే కావడం విశేషం.ఇందులో వీరిద్దరి పాత్రలు వినూత్నంగా ఉంటాయని తెలిసింది. యశ్రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో హీరోయిన్గా '1. నేనొక్కడినే', 'దోచేయ్' సినిమాల ఫేమ్ కృతీ సనన్ నటించనున్నారని బాలీవుడ్టాక్. ఆమిర్ఖాన్కు జోడీగా కృతిసనన్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.
ఆమె పేరును ఆమీర్ఖాన్ చిత్రవర్గాలకు సూచించినట్లు తెలిసింది. జయాపజయాలకు అతీతంగా చక్కటి అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది కృతిసనన్. మహేష్బాబు కథానాయకుడిగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఈ సొగసరి ఆపై బాలీవుడ్ బాట పట్టింది. హీరోపంటి, దిల్వాలే సినిమాలతో హిందీ చిత్రసీమలో ప్రతిభను చాటుకుంది.
చిత్ర పరిశ్రమలో స్నేహితుల దగ్గర కృతి నటన గురించి ఆమిర్ చెబుతున్నారట. ప్రామిసింగ్ యంగ్స్టర్స్లో కృతి ఒకరని అన్నారట. ఓ వైపు అమితాబ్ బచ్చన్... మరోవైపు ఆమిర్ఖాన్... ఇద్దరు సూపర్స్టార్లు కలసి నటిస్తున్న తొలి సినిమాలో తనకు అవకాశం రావడం పట్ల హీరోయిన్ కృతీ సనన్ సంతోషంగా ఉన్నారని ముంబయ్ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్ర షూటింగ్ ప్రారంభించి, ఆ తరువాత ఏడాది 2018 దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్వాతంత్రానికి పూర్వం భారత సరిహద్దులలో హూణులు ధగ్గులు అనబడే దారిదోపిడీ గాళ్ళ ప్రభావం ఉండేది. వారి కథాంశమే ఈ సినిమాకు మూలం అంటున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







