మహేష్బాబు నటించబోయే మూడు చిత్రాలు ఇవే!
- January 01, 2017
సూపర్స్టార్ మహేష్బాబు తాను నటించబోయే తర్వాతి మూడు చిత్రాలను ఒకేసారి ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. మహేష్ 23వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రకుల్ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'సంభవామి' అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీని తర్వాత తన 24, 25, 26 చిత్రాల వివరాలను మహేష్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
తన 24వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నట్లు తెలిపారు. 25వ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా దిల్రాజు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. 26వ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఎ.ఆర్. మురుగదాస్తో కలిసి పనిచేయడం తన కల అని, చివరికి అది నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.
నూతన సంవత్సర సందర్భంగా ఎ.ఆర్. మురుగదాస్కు, టీమ్కు, ఫ్యాన్స్కు శుభాకాంక్షలు చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







