పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం నజరానా

- January 02, 2017 , by Maagulf
పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం నజరానా

రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు గతంలో ప్రకటించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం నజరానా అందజేసింది. నగరంలోని షేక్‌ పేట్‌లో ఆమెకు వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

గతేడాది జరిగిన ఒలింపిక్స్ లో తెలుగమ్మాయి పీవీ సింధు రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిరస్మరణీయ విజయం తర్వాత సింధుకు 5 కోట్ల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌లో ఆమెకు వెయ్యి గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని.. ఆమె చేస్తానంటే తగిన ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.

రియో నుంచి హైదరాబాద్‌ కు తిరిగి వచ్చిన వెంటనే సింధును కేసీఆర్‌ సన్మానించి చెక్‌ అందజేశారు. ఇప్పుడు ఇంటి స్థలాన్ని కేటాయించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com