ఇరాక్ రాజధాని లో ఆత్మాహుతి దాడి..
- January 02, 2017
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 36 మంది మృతి చెందగా, 56 మంది గాయాల పాలయ్యారు. నగరంలోని అత్యంత రద్దీగా ఉంగే సద్దర్ పట్టణం కూడలి గల ఓ మార్కెట్ వద్ద ఓ వ్యక్తి భారీగా పేలుడు పదార్థాలతో కూడిన కారుతో సహా తనని తాను పేల్చుకున్నాడని పోలీసులు చెప్పారు. ఈ దాడిలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది దినసరి కూలీలే ఉన్నట్లు తెలిపారు.
బాగ్దాద్కు ఈశాన్యన ఉన్న ఈ ప్రాంతాల్లో ఎక్కువగా షియాలు నివసిస్తుంటారని, గత కొంతకాలంగా ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ దాడికి కారణం ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కాగా, ఇది ఉగ్రవాదుల దాడిగా అధికారులు భావిస్తున్నారు. గత మూడు రోజుల్లో బాగ్దాద్లో ఇది రెండో భారీ దాడి. బాగ్దాద్లోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో శనివారం జరిగిన దాడిలో 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







