ప్రత్యేక పార్కింగ్ స్థలం నోబెల్ గ్రహీతల కోసమే..
- January 04, 2017
నోబెల్ పురస్కారం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఈ అవార్డుకు ఎంపికైన వారు నగదు బహుమతి.. పతకం.. స్వీడీష్ రాజు చేతుల మీదుగా పురస్కారం అందుకుంటారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రతిష్టలు వస్తాయి. ఎక్కడికి వెళ్లినా వీఐపీ హోదాలో అతిథి మర్యాదలు చేస్తారు. అయితే.. ఓ యూనివర్శిటీ మాత్రం వారికి వినూత్న గౌరవం ఇచ్చింది. తమ క్యాంపస్లో నోబెల్ గ్రహీతలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని కేటాయించింది.
బెర్కెలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా క్యాంపస్లో నిత్యం విద్యార్థులు..
స్కాలర్లు.. ఉపాధ్యాయులతో సందడి వాతావరణం ఉంటుంది. వాళ్ల వాహనాలతో అక్కడి పార్కింగ్ స్థలం కూడా పార్కింగ్ ఫుల్ బోర్డు పెట్టేంతగా నిండిపోతుందట. అందుకే యూనివర్శిటీ యాజమాన్యం నోబెల్ గ్రహీతల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని కేటాయించింది.
పార్కింగ్ స్థలంపై నోబెల్ ల్యారియేట్ రిజర్వడ్ (నోబెల్ గ్రహీతలకు మాత్రమే) అని రాసి ఉంచింది. ఒకవేళ వారు లేనిపక్షంలో యూనివర్శిటీలో దశబ్ధాల పాటు బోధిస్తున్న ఆచార్యులు పార్కింగ్ చేసుకోవచ్చట. ఇంతకీ కేవలం నోబెల్ గ్రహీతలకు ఎందుకు అలా కేటాయించారంటే.. 1980లో పోలాండ్కి చెందిన రచయిత జెస్లా మిలొజ్ నోబెల్ బహుమతి అందుకున్న తర్వాత ఒక కోరిక కోరాడట.
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో తన కారు పార్కింగ్ చేసుకునేందుకు స్థలం కావాలని అన్నాడట. వెంటనే ఆ యూనివర్శిటీ యాజమాన్యం ఆయన కోరిక మేరకు పార్కింగ్ స్థలాన్ని కేటాయించింది. అలా కేటాయించిన ప్రత్యేక పార్కింగ్ స్థలం నోబెల్ గ్రహీతల కోసమే రిజర్వ్ చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







