యెమెన్‌లో వైమానిక దాడి 25 మంది మృతి..

- January 04, 2017 , by Maagulf
యెమెన్‌లో వైమానిక దాడి 25 మంది మృతి..

తిరుగుబాటుదారులు, సైన్యానికి మధ్య జరుగుతున్న యెమెన్ దద్దరిల్లుతోంది. తాజాగా జరిగిన వైమానిక దాడిలో  25మంది మరణించారు. పదులు సంఖ్యలో గాయపడ్డారు. తిరుగుబాటు దారులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో హుతి తిరుబాటుదారులు 14మంది మరణించగా....11 మంది సాధారణ పౌరులు చనిపోయారు. గత కొంతకాలంగా తిరుగుబాటుదారులకు, సైన్యానికి మధ్య భీకర పోరాటం కొనసాగుతోంది. దీంతో ఎక్కడ చూసినా దాడులకు సంబంధించిన శిధిలాలే దర్శనమిస్తున్నాయి. దాడుల కారణంగా ఆహారం అందక వేలాదిమంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com