మధుమేహం మటాష్ ప్రతిరోజూ ఒక కప్పు ఆకుకూర తీసుకుంటే..
- January 05, 2017
ప్రతిరోజూ ఒక కప్పు ఆకుకూర తీసుకునే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 14శాతం తగ్గించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లేదంటే ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండాలని వారు సూచిస్తున్నారు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరల్లోని విటమిన్-బీ పాలెట్స్ జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
వీటిల్లోని విటమిన్-ఏ కంటిచూపును మెరుగు పరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అమైనో ఆమ్లాలనూ నియంత్రిస్తాయి. ముఖ్యంగా పొన్నగంటి కూరలో ఏ విటమిన్ అధికం. దీనిని తింటే రేచీకటి రాదు. శరీరానికి చలువ కూడా. పేగుల్లోకి వెళ్లిన వెంట్రుకలను సైతం కరిగించే శక్తి దీనికుంది. ఇక కూరల్లోగానీ, పచ్చడిగా గానీ పుదీనా తీసుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఇక బరువు తగ్గించడంలోనూ ఆకుకూరలు ఎంతగానో ఉపయోగ పడతాయి. ఆకుకూరల్లోని విటమిన్ కె బరువును తగ్గిస్తుంది. ఇక ఆకుకూరల్లో క్యాలరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







