మధుమేహం మటాష్ ప్రతిరోజూ ఒక కప్పు ఆకుకూర తీసుకుంటే..
- January 05, 2017
ప్రతిరోజూ ఒక కప్పు ఆకుకూర తీసుకునే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 14శాతం తగ్గించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లేదంటే ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండాలని వారు సూచిస్తున్నారు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరల్లోని విటమిన్-బీ పాలెట్స్ జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
వీటిల్లోని విటమిన్-ఏ కంటిచూపును మెరుగు పరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అమైనో ఆమ్లాలనూ నియంత్రిస్తాయి. ముఖ్యంగా పొన్నగంటి కూరలో ఏ విటమిన్ అధికం. దీనిని తింటే రేచీకటి రాదు. శరీరానికి చలువ కూడా. పేగుల్లోకి వెళ్లిన వెంట్రుకలను సైతం కరిగించే శక్తి దీనికుంది. ఇక కూరల్లోగానీ, పచ్చడిగా గానీ పుదీనా తీసుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఇక బరువు తగ్గించడంలోనూ ఆకుకూరలు ఎంతగానో ఉపయోగ పడతాయి. ఆకుకూరల్లోని విటమిన్ కె బరువును తగ్గిస్తుంది. ఇక ఆకుకూరల్లో క్యాలరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









