రిక్రూట్‌మెంట్‌ కోసం కొత్త విధానం..

- January 07, 2017 , by Maagulf
రిక్రూట్‌మెంట్‌ కోసం కొత్త విధానం..

రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి పర్మనెంట్‌ కమిటీని రద్దు చేసిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డెవలప్‌మెంట్‌, లేబర్‌ మరియు సోషల్‌ ఎఫైర్స్‌ (మదాల్సా), ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో రిక్రూట్‌మెంట్‌ రిక్వెస్టుల్ని అందుకోవడం ప్రారంభించింది. తద్వారా కంపెనీలు అలాగే యజమానులకు రిక్రూట్‌మెంట్‌ సులభతరం కానుంది. మదాల్సా మరియు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి సంబంధించిన జాయింట్‌ డేటాబేస్‌ ఇందులో లభ్యమవుతుంది. ఎంప్లాయీ మరియు ఎంప్లాయర్‌ మధ్య కాంట్రాక్ట్‌, దాంట్లో పేర్కొనబడ్డ నిబంధనలు, ఆబ్లిగేషన్స్‌ ఇవన్నీ ఇక ఏమాత్రం దాచి ఉండబడేవి కావు. లేబర్‌ చట్టానికి అనుగుణంగానే ఒప్పందాలు జరిగేందుకు ఈ విధానం ఉపకరిస్తుంది. అప్లికేషన్లను మదాల్సా రివ్యూ చేసిన తర్వాత, వాటిని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి పంపిస్తారు. అప్లికేషన్‌ స్టేటస్‌ని ఎప్పటికప్పుడు యజమాని తెలుసుకునే వీలుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com