నేపాల్కు రూ.100 కోట్లు..
- January 07, 2017
ఆర్బీఐ నేపాల్కు రూ.100 కోట్ల విలువైన భారతీయ కరెన్సీని అందించనుంది. నేపాల్లో భారతీయ రూ.100 నోట్లకు కొరత ఏర్పడటంతో ఈ చర్యలు తీసుకుంటోంది. నేపాల్ రాష్ట్రబ్యాంక్ (ఎన్ఆర్బీ) అభ్యర్థన మేరకు ఆర్బీఐ స్పందించింది. భారత్లో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడంతో నేపాల్లో కూడా నగదు కొరత ఏర్పడింది. అక్కడ పరిస్థితిని గమనించిన ఆర్బీఐ తొలుత కొన్నాళ్లు ఆగాల్సిందిగా నేపాల్ రాష్ట్రబ్యాంక్కు తెలియజేసింది.
ఆ దేశంలో భారతీయ నోట్లకు ఎక్స్చేంజి రేటును కూడా బాగా తగ్గించింది. సిటిజన్షిప్ ఆధారంగా రూ.2,000 వరకు అందజేస్తోంది. ఆర్బీఐ నుంచి నిధులు వచ్చేదాకా ఎక్స్చేంజి రేటులో మార్పు ఉండదని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







