విజయవాడ క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన ఏపీ సీఎస్‌

- September 11, 2015 , by Maagulf
విజయవాడ క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన ఏపీ సీఎస్‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి .వై.ఆర్కృష్ణారావు శుక్రవారం విజయవాడలో తన క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే విజయవాడ కేంద్రంగా పాలన సాగిస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇక్కడికే వచ్చారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనే ఆయనకు ప్రత్యేక ఛాంబర్ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు చేసి తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రధాన కార్యదర్శిగా నిత్యం ముఖ్యమంత్రికి అందుబాటులో ఉండాల్సి రావటం, పాలనా పరమైన వ్యవహారాల్లో సంప్రదింపులు చేయాల్సి ఉండటంతో ఆయన కూడా ఇక నుంచి ఎక్కువగా విజయవాడలోనే ఉండాలని నిర్ణయించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com