విజయవాడ క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన ఏపీ సీఎస్
- September 11, 2015
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావు శుక్రవారం విజయవాడలో తన క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే విజయవాడ కేంద్రంగా పాలన సాగిస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇక్కడికే వచ్చారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనే ఆయనకు ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు చేసి తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రధాన కార్యదర్శిగా నిత్యం ముఖ్యమంత్రికి అందుబాటులో ఉండాల్సి రావటం, పాలనా పరమైన వ్యవహారాల్లో సంప్రదింపులు చేయాల్సి ఉండటంతో ఆయన కూడా ఇక నుంచి ఎక్కువగా విజయవాడలోనే ఉండాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







