ఎయిర్ ఇండియా విమానాల్లో ప్లాస్టిక్ బేడీలు సిద్ధం
- January 07, 2017
కామాంధులు విమానాల్లో కూడా తమ దుర్బుద్ధిని ప్రదర్శిస్తుండటంతో ఎయిరిండియా కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసింది. రెండు వారాల్లోనే ఇద్దరు ప్రయాణికులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో అధికారులు గట్టి నిర్ణయాలను ప్రకటించారు. విమానానికిగానీ, ఇతర ప్రయాణికులకు కానీ ప్రమాదకరంగా పరిణమించే ప్రయాణికులను సీట్లకు కట్టేసేందుకు ప్లాస్టిక్ బేడీలను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. ఎయిరిండియా చైర్మన్ అశ్వని లోహానీ మాట్లాడుతూ రెండు జతల ప్లాస్టిక్ బేడీలను అన్ని విమానాల్లోనూ సిద్ధంగా ఉంచుతామన్నారు. గతంలో కేవలం అంతర్జాతీయ విమానాల్లో మాత్రమే వీటిని ఉంచేవారమని, ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. విమానం, ప్రయాణికులు సురక్షితంగా ఉండటమే తమకు అత్యంత ప్రధాన విషయమని తెలిపారు. భద్రతకే తాము ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







