శ్రీలంక పర్యటనలో చంద్రబాబు..
- January 07, 2017
చంద్రబాబు శ్రీలంకలో పర్యటిస్తున్నారు.. శ్రీలంక ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన కొలంబో వెళ్లారు. ఇవాళ జరగనున్న ప్రపంచ పేదరిక నిర్మూలన సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేయనున్నారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమాలతో ప్రజల మధ్య బిజీగా ఉన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం పొరుగు దేశం శ్రీలంక వెళ్లారు. అక్కడ చంద్రబాబు బృందానికి ఘన స్వాగతం లభించింది. శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్ గవర్నర్, మంత్రి సుదర్శిని ఫెర్నాండో పులే, అక్కడి అధ్యక్ష కార్యాలయ ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో శనివారం రాత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం.. సిరిసేన బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో సీఎం టీమ్ పాల్గొంది. శ్రీలంక ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు కొలంబో వెళ్లిన చంద్రబాబు.. ఇవాళ జరిగే ప్రపంచ పేదరిక నిర్మూలన సదస్సులో పాల్గొంటారు. పేదరికం అంతానికి సమరం ఎలా సాగించాలనే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి తన విజన్ను సదస్సులో ఆవిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







