శ్రీలంక పర్యటనలో చంద్రబాబు..

- January 07, 2017 , by Maagulf
శ్రీలంక పర్యటనలో చంద్రబాబు..

చంద్రబాబు శ్రీలంకలో పర్యటిస్తున్నారు..  శ్రీలంక ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన కొలంబో వెళ్లారు. ఇవాళ జరగనున్న ప్రపంచ పేదరిక నిర్మూలన సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేయనున్నారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమాలతో ప్రజల మధ్య బిజీగా ఉన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం పొరుగు దేశం శ్రీలంక వెళ్లారు. అక్కడ చంద్రబాబు బృందానికి ఘన స్వాగతం లభించింది. శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్‌ గవర్నర్, మంత్రి సుదర్శిని ఫెర్నాండో పులే, అక్కడి అధ్యక్ష కార్యాలయ ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో శనివారం రాత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం.. సిరిసేన బర్త్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో సీఎం టీమ్‌ పాల్గొంది. శ్రీలంక ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు కొలంబో వెళ్లిన చంద్రబాబు.. ఇవాళ జరిగే ప్రపంచ పేదరిక నిర్మూలన సదస్సులో పాల్గొంటారు. పేదరికం అంతానికి సమరం ఎలా సాగించాలనే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి తన విజన్‌ను సదస్సులో ఆవిష్కరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com