ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారతీయుల క్షమాభిక్షకు భారత ప్రభుత్వం ప్రయత్నం

- January 09, 2017 , by Maagulf
ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారతీయుల క్షమాభిక్షకు భారత ప్రభుత్వం ప్రయత్నం

ఖతార్‌లో ఉరి శిక్ష పడిన ఇద్దరు భారతీయులను రక్షించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. తమిళనాడుకు చెందిన అలగప్ప సుబ్రమణ్యం, చెల్లదురై పెరుమాళ్ ఉపాధి కోసం ఖతార్ వెళ్ళారు. అయితే అక్కడ ఓ మహిళను హత్య చేయడంతో ఖతార్ సుప్రీం కోర్టు వారిద్దరికి ఉరి శిక్ష, మరో నిందితుడు శివకుమార్‌కు 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.
అయితే సుబ్రమణ్యం, పెరుమాళ్ క్షమాభిక్ష కోసం భారత రాయబార కార్యాలయం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ రెండు కుటుంబ సభ్యుల విన్నపంతో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. తమిళుల క్షమాభిక్ష కోసం ప్రయత్నిస్తున్నట్లు సోమవారం ఆమె ట్వీట్ చేశారు. దీని కోసం ఖతార్ నుంచి నివేదిక తెప్పించుకున్నామని, తమిళనాడు ప్రభుత్వం సహకరించాలని సుష్మా స్వరాజ్ కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com