ఖతార్లో ఉరిశిక్ష పడిన భారతీయుల క్షమాభిక్షకు భారత ప్రభుత్వం ప్రయత్నం
- January 09, 2017
ఖతార్లో ఉరి శిక్ష పడిన ఇద్దరు భారతీయులను రక్షించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. తమిళనాడుకు చెందిన అలగప్ప సుబ్రమణ్యం, చెల్లదురై పెరుమాళ్ ఉపాధి కోసం ఖతార్ వెళ్ళారు. అయితే అక్కడ ఓ మహిళను హత్య చేయడంతో ఖతార్ సుప్రీం కోర్టు వారిద్దరికి ఉరి శిక్ష, మరో నిందితుడు శివకుమార్కు 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.
అయితే సుబ్రమణ్యం, పెరుమాళ్ క్షమాభిక్ష కోసం భారత రాయబార కార్యాలయం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ రెండు కుటుంబ సభ్యుల విన్నపంతో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. తమిళుల క్షమాభిక్ష కోసం ప్రయత్నిస్తున్నట్లు సోమవారం ఆమె ట్వీట్ చేశారు. దీని కోసం ఖతార్ నుంచి నివేదిక తెప్పించుకున్నామని, తమిళనాడు ప్రభుత్వం సహకరించాలని సుష్మా స్వరాజ్ కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







