మూతపడనున్న మిలిటరీ కోర్టులు
- January 09, 2017
పాకిస్థాన్లో సైనిక కోర్టులు మూతపడనున్నాయి. వాటి గడువును పొడిగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2014లో పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు దాడి చేసి వందకుపైగా విద్యార్థులు, సిబ్బందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడి కేసులపై సత్వర విచారణకు మిలిటరీ కోర్టులను పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని కోసం రాజ్యాంగానికి 21వ సవరణ చేసింది. 2015 జనవరి 7న నుంచి రెండేళ్ళపాటు సైనిక కోర్టులు అమలులో ఉంటాయని పేర్కొంది. రెండేళ్ళలో సుమారు 274 కేసులను విచారించిన మిలిటరీ కోర్టులు 161 మందికి మరణ శిక్ష విధించాయి. ఇందులో 12 మందికి శిక్షలు అమలు చేశాయి. 113 మంది దోషులకు జైలు శిక్ష విధించాయి. అయితే ఈ ఏడాది జనవరి 7తో మిలిటరీ కోర్టుల గడువు ముసిగింది. దీంతో వీటి గడువు పెంచేది లేదని పాక్ అంతర్గత మంత్రి చౌదరి నసిర్ అలీఖాన్ స్పష్టం చేశారు. విచారణలో ఉన్న కేసులను తీవ్రవాద వ్యతిరేక కోర్టులకు బదిలీకి చేయనున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







