ఆగస్టులో ధ్రువ నక్షత్రం....
- January 09, 2017
చెన్నై: కొంతకాలంగా గౌతం మేనన్ 'ధ్రువ నక్షత్రం' నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. తొలుత సూర్యతో తెరకెక్కించాలని భావించారు. ఆ తర్వాత పలువురు హీరోలను దాటుకుని విక్రం చేతికొచ్చింది. నిజానికి 'ఇరుముగన్' సినిమా తర్వాత విజయ్చందర్ దర్శకత్వంలోని ఓ సినిమా, ఆ తర్వాత హరి దర్శకత్వంలోని 'సామి 2'లో విక్రం నటిస్తారని వార్తలొచ్చాయి. అయితే 'సామి 2' కన్నా ముందుగానే 'ధ్రువ నక్షత్రం' చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు విక్రం. ఈ సినిమా కమల్ నటించిన 'వేట్టైయాడు విళయాడు' తరహాలో ఉంటుందని సమాచారం. చిత్రీకరణ పూర్తిగా విదేశాల్లోనే జరగనుంది.
ఇందులో విక్రం.. జాన్ అనే గూఢచారి పాత్రలో నటించనున్నారు. రానున్న ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కన్నా ముందుగా విజయ్చందర్ దర్శకత్వంలోని చిత్రం విడుదల కానుంది.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







