హైదరాబాద్లో 247 మంది మందుబాబులకు జైలుశిక్ష...
- January 09, 2017
శివారులో 9 రోజుల్లో 835 కేసులు
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ : కొత్త ఏడాదిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఖాకీలు నడుం బిగించారు. మందుబాబులపై కొరడా ఝళిపిస్తున్నారు. జనవరి 1 నుంచి సోమవారం వరకు సైబరాబాద్, రాచకొండ పరిధిలో 835 మంది మందుబాబులను పట్టుకున్నారు. అధికంగా రాజేంద్రనగర్లో 95, అల్వాల్లో 92 మంది పట్టుబడ్డారు. మొత్తం 247 మందికి జైలుశిక్ష విధిస్తూ మియాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్ న్యాయస్థానాలు వేర్వేరుగా తీర్పు వెలువరించాయి. ఎక్కువ మందికి 4-8 రోజుల వరకు జైలుశిక్ష పడింది. ''కొత్త ఏడాదిలో రోడ్డుప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం.
అందులో భాగంగా ప్రత్యేకంగా స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్లు ఏర్పాటుచేశాం. ఔటర్పై ప్రమాదాలను తగ్గిస్తాం. మందుబాబులు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. రమ్య, సంజన లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం.
మందుబాబులకు డీఆడిక్షన్ కేంద్రంలో వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం.'' అని రాచకొండ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ దివ్యచరణ్ రావు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









