హైదరాబాద్లో 247 మంది మందుబాబులకు జైలుశిక్ష...
- January 09, 2017
శివారులో 9 రోజుల్లో 835 కేసులు
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ : కొత్త ఏడాదిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఖాకీలు నడుం బిగించారు. మందుబాబులపై కొరడా ఝళిపిస్తున్నారు. జనవరి 1 నుంచి సోమవారం వరకు సైబరాబాద్, రాచకొండ పరిధిలో 835 మంది మందుబాబులను పట్టుకున్నారు. అధికంగా రాజేంద్రనగర్లో 95, అల్వాల్లో 92 మంది పట్టుబడ్డారు. మొత్తం 247 మందికి జైలుశిక్ష విధిస్తూ మియాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్ న్యాయస్థానాలు వేర్వేరుగా తీర్పు వెలువరించాయి. ఎక్కువ మందికి 4-8 రోజుల వరకు జైలుశిక్ష పడింది. ''కొత్త ఏడాదిలో రోడ్డుప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం.
అందులో భాగంగా ప్రత్యేకంగా స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్లు ఏర్పాటుచేశాం. ఔటర్పై ప్రమాదాలను తగ్గిస్తాం. మందుబాబులు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. రమ్య, సంజన లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం.
మందుబాబులకు డీఆడిక్షన్ కేంద్రంలో వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం.'' అని రాచకొండ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ దివ్యచరణ్ రావు తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







