భారత్ కెప్టెన్గా చివరి మ్యాచ్ ఆడనున్న ధోని....
- January 09, 2017
ముంబై: భారత్-ఇంగ్లండ్ జట్లమధ్య పరిమిత ఓవర్ల సిరీస్కు రంగం సిద్ధమవుతోంది. అందుకోసం ఇరు జట్లూ రెడీ అవుతున్నాయి. ఈనెల 15న మొదలయ్యే వన్డే సిరీస్కు సన్నాహకంగా భారత్-ఎ, ఇంగ్లండ్ లెవెన్ జట్లు రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ రెండు మ్యాచ్లకూ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదిక కానుంది. మంగళవారం జరిగే తొలి డే/నైట్ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ, గురువారం జరిగే డే మ్యాచ్లో అజింక్యా రహానె భారత-ఎను నడిపించనున్నారు. కాగా.. ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఈ వామప్ బరిలోకి దిగుతోంది. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ వదులుకున్న తర్వాత ధోనీ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో అతనేం చేస్తాడోనని ఆసక్తి నెలకొంది.
మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకొచ్చిన యువరాజ్ సింగ్, గాయాల నుంచి కోలుకున్న శిఖర్ ధవన్, ఆశీష్ నెహ్రా, హార్దిక్ పాండ్యాలకు కూడా ఇది మ్యాచ్ ప్రాక్టీస్ కానుంది. దీంతో ధోనీతోపాటు యువీ, ధవన్, నెహ్రాపై అందరి దృష్టీ నెలకొంది. కాగా.. టెస్టు సిరీస్లో ఘోర పరాజయం పాలైన ఇంగ్లండ్..
పరిమిత ఓవర్ల క్రికెట్లోనైనా పుంజుకోవాలని యోచిస్తోంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో రాణించి వన్డే సిరీస్ ఆరంభానికి ముందు భారత్కు గట్టి హెచ్చరికలు పంపాలని భావిస్తోంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్తోపాటు, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్, మొయిన్ అలీపై ఆ జట్టు భారీగా అంచనాలు పెట్టుకుంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







