అడ్నాక్ రిఫైనరీలో అగ్ని ప్రమాదం..
- January 12, 2017
రువైస్లోని తక్రీర్ రిఫైనరీ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నాక్) ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాద స్థలంలో ఎవరూ గాయపడ్డంగానీ, చనిపోవడంగానీ జరగలేదని అడ్నాక్ అధికార ప్రతినిథి చెప్పారు. ప్రమాద ఘటనపై విచారణ జరుగుతున్నట్లు ఆయన వివరించారు. ఇంకో వైపున ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సేఫ్టీ విభాగం అప్రమత్తమై మంటల్ని అదుపు చేసింది. 1999లో అబుదాబీ ఆయిల్ కంపెనీ తక్రీర్ ఏర్పాటయ్యింది. ప్రమాదం జరిగిన చోట పెట్రోలియం ప్రోడక్ట్స్, అలాగే గ్రాన్యూల్డ్ సల్ఫర్ వంటివి ఉత్పత్తి అవుతాయి. అబుదాబీ వెస్ట్రన్ రీజియన్లో 250 కిలోమీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







