భీమవరం ఫ్యాన్స్ గొడవ కు నష్టపరిహారం పంపిన పవర్ స్టార్
- September 11, 2015
పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న భీమవరంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భీమవరంలో అల్లకల్లోలం సృష్టించారు. వారి ఆగ్రహ జ్వాలల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఈ గొడవ రెండు వర్గాల అభిమానుల మధ్య తీవ్రరూపం దాల్చడంతో అక్కడ 144 సెక్షన్ విధించే పరిస్థితి ఏర్పడింది. మీడియాలో హాట్ టాపిక్ అయిన ఈ గొడవ అంశం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లింది. ఈ సంఘటనపై ఆయన వెంటనే స్పందించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తన అభిమానుల వల్ల కలిగిన నష్టాన్ని తాను భరిస్తానని ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తాత్కాలికి పరిహారంగా భీమవరం ఎస్ఐకు 3లక్షల రూపాయలు పంపించినట్లు తెలుస్తోంది. తన వల్ల, తన అభిమానుల వల్ల ఎవరికీ, ఎలాంటి నష్టం వాటిల్ల కూడదనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ ముందుకు రావడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఉదార గుణం మాత్రమే కాదు, మంచి మనసు ఉంది, సమాజం పట్ల బాధ్యత ఉందని పలువురు ఆయనప్ను పొగిడేస్తున్నారు. క్షణికావేశంలో ఆగ్రహావేశాలకు గురై విధ్వంసం సృష్టించడంపై అభిమానులను కూడా పవన్ కళ్యాణ్ మందలించినట్లు తెలుస్తోంది. ఎన్ని మంచి పనులు చేసినా...ఇలాంటి సంఘటనల వల్ల అవన్నీ తుడిచి పెట్టుకుపోతాయని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని సూచించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







