అమరావతి వేదికగా అంధుల టీ-20 ప్రపంచ కప్‌

- January 15, 2017 , by Maagulf
అమరావతి వేదికగా అంధుల టీ-20 ప్రపంచ కప్‌

టీ-20 అంధుల ప్రపంచ కప్‌ క్రికెట్‌ టోర్నీ అమరావతి పరిధిలో నిర్వహించనున్నట్లు పర్యవేక్షక కమిటీ ఉన్నతాధికారిణి, భారతదేశ అంధుల క్రికెట్‌ బోర్డు సభ్యురాలు జహారబేగం తెలిపారు. తెనాలిలోని గాంధీ వృద్ధాశ్రమాన్ని ఆదివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 12 వరకు టోర్నీ ఉంటుందని, విజయవాడ-గుంటూరుల్లో నిర్వహించటానికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు వివరించారు. ఆశ్రమంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధులకు భోజనం ఏర్పాట్లు చేసి, దుస్తులు పంపిణీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com